సౌదీ లో పెట్టుబడిదారులకు వ్యాపార వీసా రుసుము మినహాయింపు
- November 08, 2023
రియాద్: సౌదీ అరేబియా వ్యాపార సందర్శన వీసా రుసుము చెల్లింపు నుండి దౌత్యపరమైన లేదా ప్రత్యేక పాస్పోర్ట్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పెట్టుబడిదారులకు దౌత్యవేత్తలుగా అధికారిక హోదా ఉండదనే షరతు విధించారు. సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA), పెట్టుబడి మంత్రిత్వ శాఖ (MISA) సహకారంతో "విజిటింగ్ ఇన్వెస్టర్" పేరుతో ఎలక్ట్రానిక్ బిజినెస్ విజిట్ వీసాల జారీ రెండవ దశను సోమవారం ప్రారంభించింది. గత జూన్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పెట్టుబడి మంత్రిత్వ శాఖ సహకారంతో యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా మరియు ఓషియానియాలోని అనేక దేశాల పౌరులుగా ఉన్న పెట్టుబడిదారుల కోసం వ్యాపార సందర్శన వీసా యొక్క మొదటి దశను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







