సౌదీ లో పెట్టుబడిదారులకు వ్యాపార వీసా రుసుము మినహాయింపు
- November 08, 2023
రియాద్: సౌదీ అరేబియా వ్యాపార సందర్శన వీసా రుసుము చెల్లింపు నుండి దౌత్యపరమైన లేదా ప్రత్యేక పాస్పోర్ట్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పెట్టుబడిదారులకు దౌత్యవేత్తలుగా అధికారిక హోదా ఉండదనే షరతు విధించారు. సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA), పెట్టుబడి మంత్రిత్వ శాఖ (MISA) సహకారంతో "విజిటింగ్ ఇన్వెస్టర్" పేరుతో ఎలక్ట్రానిక్ బిజినెస్ విజిట్ వీసాల జారీ రెండవ దశను సోమవారం ప్రారంభించింది. గత జూన్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పెట్టుబడి మంత్రిత్వ శాఖ సహకారంతో యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా మరియు ఓషియానియాలోని అనేక దేశాల పౌరులుగా ఉన్న పెట్టుబడిదారుల కోసం వ్యాపార సందర్శన వీసా యొక్క మొదటి దశను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!









