బద్రీనాథ్ ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు
- November 08, 2023
బద్రినాథ్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని బద్రినాథ్ ఆలయాన్నిసందర్శించారు. ప్రత్యేక హెలికాఫ్టర్లో అక్కడికి చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో రాష్ట్రపతి 25 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అజయ్.. రాష్ట్రపతికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక సీఎం ధామీ ఆలయ ప్రతిరూపాన్ని బహూకరించారు. ఆలయ సందర్శన అనంతరం రాష్ట్రపతి శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ హెచ్ఎన్బీ గర్వాల్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









