పర్యావరణ పరిరక్షణకు ఫత్వాలు జారీకి నిపుణుల డిమాండ్!
- November 09, 2023
యూఏఈ: సుస్థిరత అనేది ఇస్లాం ప్రాథమిక సిద్ధాంతం. భూమిని సంరక్షించడం అంటే మతాన్ని పరిరక్షించినట్లే అని అబుదాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్శిటీ ఫర్ హ్యుమానిటీస్ ప్రొఫెసర్ డాక్టర్ వదీమా అల్ ధాహెరి అన్నారు. అందుకే పర్యావరాణ పరిరక్షణకు ముస్లింలందరికీ కట్టుబడి ఉండాలరి పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ఇస్లామిక్ చట్టం చేయాలని కోరారు. యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా అంతర్జాతీయ సదస్సులో మొదటి రోజున ఆమె ప్రసంగించారు. ఇందులో పాల్గొన్న నిపుణులు ఇది అనేక అంశాలపై చర్చించారు. పర్యావరణాన్ని ఎలా సంరక్షించడం, సుస్థిరతను నిర్ధారించడం ఇస్లాం ప్రధాన భాగమని వక్తలు ప్రధానంగా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యూఏఈ ఇండిపెండెంట్ క్లైమేట్ చేంజ్ యాక్సిలరేటర్స్ ప్రెసిడెంట్, సీఈఓ అయిన షేఖా షమ్మా బింట్ సుల్తాన్ బిన్ ఖలీఫా అల్ నహ్యాన్ తన కీలక ప్రసంగంలో స్థిరమైన కొత్త భవిష్యత్తుకు అనుగుణంగా మారడం అనేది గతంలో కంటే చాలా అత్యవసరమని అన్నారు. యూఏఈ ఈ నెలాఖరున దుబాయ్లో COP28కి ఆతిథ్యం ఇస్తుంది. పారిస్ ఒప్పందంపై దాని పురోగతిని సమీక్షిస్తారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







