పర్యావరణ పరిరక్షణకు ఫత్వాలు జారీకి నిపుణుల డిమాండ్!
- November 09, 2023
యూఏఈ: సుస్థిరత అనేది ఇస్లాం ప్రాథమిక సిద్ధాంతం. భూమిని సంరక్షించడం అంటే మతాన్ని పరిరక్షించినట్లే అని అబుదాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్శిటీ ఫర్ హ్యుమానిటీస్ ప్రొఫెసర్ డాక్టర్ వదీమా అల్ ధాహెరి అన్నారు. అందుకే పర్యావరాణ పరిరక్షణకు ముస్లింలందరికీ కట్టుబడి ఉండాలరి పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ఇస్లామిక్ చట్టం చేయాలని కోరారు. యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా అంతర్జాతీయ సదస్సులో మొదటి రోజున ఆమె ప్రసంగించారు. ఇందులో పాల్గొన్న నిపుణులు ఇది అనేక అంశాలపై చర్చించారు. పర్యావరణాన్ని ఎలా సంరక్షించడం, సుస్థిరతను నిర్ధారించడం ఇస్లాం ప్రధాన భాగమని వక్తలు ప్రధానంగా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యూఏఈ ఇండిపెండెంట్ క్లైమేట్ చేంజ్ యాక్సిలరేటర్స్ ప్రెసిడెంట్, సీఈఓ అయిన షేఖా షమ్మా బింట్ సుల్తాన్ బిన్ ఖలీఫా అల్ నహ్యాన్ తన కీలక ప్రసంగంలో స్థిరమైన కొత్త భవిష్యత్తుకు అనుగుణంగా మారడం అనేది గతంలో కంటే చాలా అత్యవసరమని అన్నారు. యూఏఈ ఈ నెలాఖరున దుబాయ్లో COP28కి ఆతిథ్యం ఇస్తుంది. పారిస్ ఒప్పందంపై దాని పురోగతిని సమీక్షిస్తారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







