గాజాకు మద్దతుగా.. అబుదాబి, అజ్మాన్లో విరాళాల డ్రైవ్
- November 09, 2023
యూఏఈ: యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో ఉన్న పాలస్తీనియన్లకు సహాయం చేయాలనుకునే యూఏఈ నివాసితులు అజ్మాన్, అబుదాబిలో షెడ్యూల్ చేయబడిన రెండు కొత్త ఈవెంట్లలో సహాయక చర్యలకు స్వచ్ఛందంగా తరలిరావచ్చు. తారాహుమ్ ఫర్ గాజా (గాజా కోసం కరుణ) ప్రచారం నవంబర్ 9న అజ్మాన్లో.. నవంబర్ 12న యూఏఈ రాజధానిలో బుధవారం ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోఫా) మరియు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ పర్యవేక్షణలో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు.
రెండు 'కంపాషన్ ఫర్ గాజా' ఈవెంట్ల వివరాలు:
అజ్మాన్: నవంబర్ 9, ఎమిరేట్స్ హాస్పిటాలిటీ హాల్
అబుదాబి: నవంబర్ 12, మినా జాయెద్, అబుదాబి పోర్ట్స్ హాల్, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు
యూఏఈ ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవలే ఆపరేషన్ గాలంట్ నైట్ 3ని ప్రారంభించాలని ఆదేశించారు. గాజా స్ట్రిప్లో ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేయనున్నారు. వైద్య చికిత్స కోసం 1,000 మంది పాలస్తీనా పిల్లలను యూఏఈకి తీసుకురావాలని కూడా ఆయన ఆదేశించారు. గాజాకు మద్దుతుగా దేశంలోని అధీకృత స్వచ్ఛంద సంస్థలు మరియు మానవతా సంస్థల ద్వారా కూడా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







