గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి పై ఇజ్రాయెల్ దాడులు.. 13 మంది మృతి
- November 11, 2023
యూఏఈ: సెంట్రల్ గాజా సిటీలో అతిపెద్ద ఆసుపత్రి కాంపౌండ్ వద్ద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 13 మంది మరణించారని గాజా స్ట్రిప్లోని హమాస్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. గాజా నగరంలోని కొన్ని ఇతర ఆసుపత్రులను ఇజ్రాయెల్ ట్యాంకులు చుట్టుముట్టాయని, గత కొన్ని వారాలుగా వందల వేల మంది ప్రజలు గాజా దక్షిణ ప్రాంతానికి తరలి వెళుతున్నారు. మరోవైపు గురువారం ఆసుపత్రి సమీపంలో భారీ పోరాటం జరిగిందని, ఇందులో డజన్ల కొద్దీ ఉగ్రవాదులు చనిపోయారని ఇజ్రాయెల్ వెల్లడించింది. హమాస్ ఆసుపత్రులను రహస్య స్థావరాలుగా ఉపయోగించుకుందని ఆరోపించింది. ఇదిలా ఉండగా కరెంటు, నీరు, ఆహారం లేకుండా తాము విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని గాజా ఆసుపత్రుల డైరెక్టర్ జనరల్ మహ్మద్ జాకౌట్ తెలిపారు. గాజా స్ట్రిప్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 10,800 మంది కంటే ఎక్కువ మంది ఇప్పటివరకు మరణించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







