గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి పై ఇజ్రాయెల్ దాడులు.. 13 మంది మృతి
- November 11, 2023
యూఏఈ: సెంట్రల్ గాజా సిటీలో అతిపెద్ద ఆసుపత్రి కాంపౌండ్ వద్ద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 13 మంది మరణించారని గాజా స్ట్రిప్లోని హమాస్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. గాజా నగరంలోని కొన్ని ఇతర ఆసుపత్రులను ఇజ్రాయెల్ ట్యాంకులు చుట్టుముట్టాయని, గత కొన్ని వారాలుగా వందల వేల మంది ప్రజలు గాజా దక్షిణ ప్రాంతానికి తరలి వెళుతున్నారు. మరోవైపు గురువారం ఆసుపత్రి సమీపంలో భారీ పోరాటం జరిగిందని, ఇందులో డజన్ల కొద్దీ ఉగ్రవాదులు చనిపోయారని ఇజ్రాయెల్ వెల్లడించింది. హమాస్ ఆసుపత్రులను రహస్య స్థావరాలుగా ఉపయోగించుకుందని ఆరోపించింది. ఇదిలా ఉండగా కరెంటు, నీరు, ఆహారం లేకుండా తాము విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని గాజా ఆసుపత్రుల డైరెక్టర్ జనరల్ మహ్మద్ జాకౌట్ తెలిపారు. గాజా స్ట్రిప్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 10,800 మంది కంటే ఎక్కువ మంది ఇప్పటివరకు మరణించారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







