బయోమెట్రిక్ డేటా ఫోర్జరీ.. ఇద్దరు ప్రయాణికులు బహిష్కరణ

- November 11, 2023 , by Maagulf
బయోమెట్రిక్ డేటా ఫోర్జరీ.. ఇద్దరు ప్రయాణికులు బహిష్కరణ

మదీనా: నకిలీ బయోమెట్రిక్ ఫీచర్లతో సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్థానీ ప్రయాణీకులను మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బహిష్కరించారు.ఇద్దరు ప్రయాణీకులు రెసిడెన్సీ , వర్క్ నిబంధనలను ఉల్లంఘించి బహిష్కరణకు గురయ్యారని అదికారులు గుర్తించారు. రెసిడెన్సీ మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి లేదా డ్రగ్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్‌కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారాన్ని నివేదించాలని భద్రతా అధికారులు పౌరులు, నివాసితులను కోరారు. సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా పెడతామని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com