దుబాయ్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు..
- November 11, 2023
దుబాయ్: దుబాయ్ లో ట్రాఫిక్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే.రోడ్డు ప్రమాదాల నివారణకు అక్కడి ట్రాఫిక్ విభాగం ఇలా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందుకే ఆ దేశాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా సంభవిస్తుంటాయి. నివాసితులు, దేశ పౌరులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. లేనిపక్షంలో భారీ జరిమానాలు, బ్లాక్ పాయింట్స్ వేయడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ అధికారులు వాహనం కూడా జప్తు చేస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దుబాయి ట్రాఫిక్ పోలీసులు ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న ఒక కీలక అంశానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అదేంటంటే.. అనుమతిలేని చోట వాహనాలను 'యూటర్న్' చేయడం.
ఇలా నిషేధిత ప్రాంతాల వద్ద ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేస్తూ వాహనాలను యూటర్న్ చేయడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దుబాయి పోలీస్ విభాగానికి చెందిన స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. దాంతో ఈ విషయాన్ని ఇకపై ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ ఉల్లంఘనకు గాను 500 దిర్హాములు జరిమానా, 4 బ్లాక్పాయింట్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఇలా అనుమతిలేని చోట్లలో యూటర్న్ చేయడం వల్ల గత 10నెలల్లో ఏకంగా 29,463 ప్రమాదాలు జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనల కారణంగా ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సో.. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నివారించడంలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులను ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని దుబాయ్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం









