17 న తెలంగాణ లో పర్యటించబోతున్న రాహుల్
- November 14, 2023
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈసారి తెలంగాణ లో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధిష్టానం గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఈ తరుణంలో పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంది. ఇతర పార్టీల నేతలను రాబట్టుకోవడంలో సక్సెస్ అయినా కాంగ్రెస్..మేనిఫెస్టో తో మరింత గా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ప్రచారంలో కూడా దూసుకెళ్తుంది. లోకల్ నేతలే కాకుండా జాతీయ స్థాయి నేతలను సైతం రంగంలోకి దింపి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
ఇప్పటికే రాహుల్ , ప్రియాంక గాంధీ లు పలు పర్యటనలు చేయగా..మరోసారి వీరిద్దరూ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 17న రాహుల్ గాంధీ రానుండగా.. ఈ నెల 20న ప్రియాంకగాంధీ రానున్నారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునతోపాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సీఎంలు కూడా ప్రచారం కోసం తెలంగాణలో పర్యటించనున్నారు.
ఈ నెల 17న తెలంగాణకు రానున్న రాహుల్గాంధీ ఆరురోజులపాటు ఇక్కడే మకాం వేసి ప్రచారంలో బిజీకానున్నారు. అదే రోజు వరంగల్, పాలకుర్తి, భువనగిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఐదు రోజులపాటు ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టాలన్న షెడ్యూల్పై రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. రాహుల్గాంధీ ప్రచారంలో భాగంగా నిరుద్యోగులతో భేటీకానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగులు కొందరు రెండు బృందాలుగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 10 రోజులపాటు నిరుద్యోగ చైతన్యం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో రాహుల్గాంధీ పాల్గొనే అవకాశం ఉంది.
ఇక రాహుల్ పర్యటన సమయంలోనే ప్రియాంకగాంధీ కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 20 తర్వాత సుడిగాలి పర్యటనలతో రాష్ట్రంలోని పలుచోట్ల 5 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునతోపాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సీఎంలు కూడా ప్రచారం కోసం తెలంగాణకు రానున్నారు. వీరి టూర్ షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లోనే ఖరారుకానుంది.
తాజా వార్తలు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం









