రక్త హీనతకు దానిమ్మ ఓ వరమే సుమా.!
- November 14, 2023
దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ తెలిసిందే. ఈ పండు ఎక్కువగా తింటే రక్తం పడుతుందని అంటుంటారు. నిజమే. హెమోగ్లోబిన్ సరిపడగా వుంటేనే శరీరం ఎర్ర రక్తకణాలను సక్రమంగా వృద్ధి చేయగలుగుతుంది.
ఎర్రరక్తకణాలు సరిపడా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఎర్రరక్తకణాలు వుండాల్సిన సంఖ్యలో వుంటేనే శరీరానికి అలసట, నీరసం వుండదు. కాంతివంతంగా ఆరోగ్యంగా వుంటుంది.
అందుకే రక్త హీనత రాకుండా వుండాలంటే దానిమ్మ పండును రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దానిమ్మ పండులోని ఫోలేట్, ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధిలో బాగా తోడ్పడుతాయ్.
అలాగే, ఈ పండులోని విటమిన్ ఎ,బి,సి,కె విటమిన్లు శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు. సో, దానిమ్మ పండును వీలైతే రోజూ లేదంటే వారంలో రెండు మూడు సార్లయినా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఆకుకూరల్లో పాలకూరను ఎక్కువగా తినాలని చెబుతున్నారు. పాలకూరలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది రక్త హీనత రాకుండా కాపాడుతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







