రక్త హీనతకు దానిమ్మ ఓ వరమే సుమా.!
- November 14, 2023
దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ తెలిసిందే. ఈ పండు ఎక్కువగా తింటే రక్తం పడుతుందని అంటుంటారు. నిజమే. హెమోగ్లోబిన్ సరిపడగా వుంటేనే శరీరం ఎర్ర రక్తకణాలను సక్రమంగా వృద్ధి చేయగలుగుతుంది.
ఎర్రరక్తకణాలు సరిపడా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఎర్రరక్తకణాలు వుండాల్సిన సంఖ్యలో వుంటేనే శరీరానికి అలసట, నీరసం వుండదు. కాంతివంతంగా ఆరోగ్యంగా వుంటుంది.
అందుకే రక్త హీనత రాకుండా వుండాలంటే దానిమ్మ పండును రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దానిమ్మ పండులోని ఫోలేట్, ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధిలో బాగా తోడ్పడుతాయ్.
అలాగే, ఈ పండులోని విటమిన్ ఎ,బి,సి,కె విటమిన్లు శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు. సో, దానిమ్మ పండును వీలైతే రోజూ లేదంటే వారంలో రెండు మూడు సార్లయినా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఆకుకూరల్లో పాలకూరను ఎక్కువగా తినాలని చెబుతున్నారు. పాలకూరలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది రక్త హీనత రాకుండా కాపాడుతుంది.
తాజా వార్తలు
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం







