రక్త హీనతకు దానిమ్మ ఓ వరమే సుమా.!
- November 14, 2023
దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ తెలిసిందే. ఈ పండు ఎక్కువగా తింటే రక్తం పడుతుందని అంటుంటారు. నిజమే. హెమోగ్లోబిన్ సరిపడగా వుంటేనే శరీరం ఎర్ర రక్తకణాలను సక్రమంగా వృద్ధి చేయగలుగుతుంది.
ఎర్రరక్తకణాలు సరిపడా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఎర్రరక్తకణాలు వుండాల్సిన సంఖ్యలో వుంటేనే శరీరానికి అలసట, నీరసం వుండదు. కాంతివంతంగా ఆరోగ్యంగా వుంటుంది.
అందుకే రక్త హీనత రాకుండా వుండాలంటే దానిమ్మ పండును రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దానిమ్మ పండులోని ఫోలేట్, ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధిలో బాగా తోడ్పడుతాయ్.
అలాగే, ఈ పండులోని విటమిన్ ఎ,బి,సి,కె విటమిన్లు శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు. సో, దానిమ్మ పండును వీలైతే రోజూ లేదంటే వారంలో రెండు మూడు సార్లయినా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఆకుకూరల్లో పాలకూరను ఎక్కువగా తినాలని చెబుతున్నారు. పాలకూరలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది రక్త హీనత రాకుండా కాపాడుతుంది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి