గాజా విషాదం: హాస్పిటల్ కాంప్లెక్స్లో ఒకేచోట 179 మంది ఖననం
- November 15, 2023
యూఏఈ: ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో మరణించిన శిశువులు, రోగులతో సహా 179 మందిని కాంప్లెక్స్లోని "సామూహిక సమాధి"లో ఖననం చేసినట్లు గాజా అతిపెద్ద ఆసుపత్రి డైరెక్టర్ మంగళవారం తెలిపారు. "మేము వారిని సామూహిక సమాధిలో ఖననం చేయవలసి వచ్చింది" అని అల్ షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబు సాల్మియా తెలిపారు. ఆసుపత్రిలో ఇంధన సరఫరా అయిపోయిన తరువాత ఏడుగురు పిల్లలు, 29 మంది ఇంటెన్సివ్ కేర్ రోగులు చనిపోయారని వెల్లడించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజా స్ట్రిప్లోకి ఇంధనం ట్యాంకులు రాకపోవడంతో ఆసుపత్రి కాంప్లెక్స్లో సమస్యలు తలెత్తాయి. మరోవైపు సోమవారం నుండి మంగళవారం వరకు రాత్రిపూట పోరాటం మరియు వైమానిక దాడులు మునుపటి రాత్రుల కంటే తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ ట్యాంకులు అల్ షిఫా ఆసుపత్రి గేట్ల వద్ద ఉన్నాయి. ఇది హమాస్ ఉపయోగించే అండర్గ్రౌండ్ కమాండ్ "నోడ్"ని దాచిపెడుతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా ఈ వార్తలను పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ఖండించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







