గాజా విషాదం: హాస్పిటల్ కాంప్లెక్స్లో ఒకేచోట 179 మంది ఖననం
- November 15, 2023
యూఏఈ: ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో మరణించిన శిశువులు, రోగులతో సహా 179 మందిని కాంప్లెక్స్లోని "సామూహిక సమాధి"లో ఖననం చేసినట్లు గాజా అతిపెద్ద ఆసుపత్రి డైరెక్టర్ మంగళవారం తెలిపారు. "మేము వారిని సామూహిక సమాధిలో ఖననం చేయవలసి వచ్చింది" అని అల్ షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబు సాల్మియా తెలిపారు. ఆసుపత్రిలో ఇంధన సరఫరా అయిపోయిన తరువాత ఏడుగురు పిల్లలు, 29 మంది ఇంటెన్సివ్ కేర్ రోగులు చనిపోయారని వెల్లడించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజా స్ట్రిప్లోకి ఇంధనం ట్యాంకులు రాకపోవడంతో ఆసుపత్రి కాంప్లెక్స్లో సమస్యలు తలెత్తాయి. మరోవైపు సోమవారం నుండి మంగళవారం వరకు రాత్రిపూట పోరాటం మరియు వైమానిక దాడులు మునుపటి రాత్రుల కంటే తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ ట్యాంకులు అల్ షిఫా ఆసుపత్రి గేట్ల వద్ద ఉన్నాయి. ఇది హమాస్ ఉపయోగించే అండర్గ్రౌండ్ కమాండ్ "నోడ్"ని దాచిపెడుతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా ఈ వార్తలను పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ఖండించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







