యూఏఈ నివాసితులు 2024లో సెలవులను ఎలా ప్లాన్ చేస్తారో తెలుసా?
- November 15, 2023
యూఏఈ: యూఏఈ నివాసితులలో 70% మంది తమ స్వంత నగరం కంటే రోజువారీ జీవితం చౌకగా ఉండే గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. తద్వారా లేదా సుదూర విమానాల ఖర్చును తగ్గించుకోవడం తక్కువ దూర ప్రాంతాలకు ప్రయాణించడం ద్వారా వారి సెలవుల ఖర్చును తగ్గించుకోవాలని చూస్తున్నారని ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్ booking.com చేసిన కొత్త సర్వే తెలిపింది. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు స్వల్పకాలిక లగ్జరీ అనుభవాల కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 62 శాతం యూఏఈ ఆధారిత హాలిడే మేకర్లు ఫైవ్ స్టార్ రిసార్ట్ కోసం కాకుండా ఒక రోజు గడిపేలా చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. వెబ్సైట్ 33 దేశాలలో 27,000 మంది ప్రయాణికులను సర్వే చేసింది. సర్వేలో పాల్గొన్న మొత్తం 56 శాతం మందితో పోలిస్తే.. 75 శాతం మంది యూఏఈ ప్రయాణికులు బయటికి వెళ్లినప్పుడు చల్లటి వాతావరణం ఉండే ప్రాంతాలను హాలీడే స్పాట్ గా ఎంచుకుంటున్నారు. అనేక మంది యూఏఈ నివాసితులు పీక్ సీజన్ వెలుపల సెలవు తీసుకోవడం ద్వారా వారి సెలవు బిల్లులను తగ్గించుకోవాలని అనుకుంటున్నారు. యాభై ఆరు శాతం మంది 2024లో తమ ప్రయాణ బడ్జెట్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అకడమిక్ సెషన్లో పిల్లలను పాఠశాల నుండి బయటకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







