జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి

- November 15, 2023 , by Maagulf
జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దోడా ప్రాంతంలో అస్సార్‌ వద్ద ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా పాతిక మంది మృతదేహాల్ని వెలికి తీసింది రెస్క్యూ టీం.

సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. క్షతగాత్రుల్ని కిష్తావర్‌, దోడా సీఎంసీ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com