సౌదీ, ఇద్దరు ప్రవాసులకు మొత్తం 55 సంవత్సరాల జైలు శిక్ష
- November 16, 2023
జెడ్డా: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు సౌదీ కోర్టు ఒక సౌదీ పౌరుడు, ఇద్దరు అరబ్ జాతీయులకు మొత్తం 55 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, దోషులలో ఒకరికి 25 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించగా.. మరో ఇద్దరికి ఒక్కొక్కరికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అలాగే కోర్టు దోషులకు SR300000 జరిమానా విధించింది. జైలు శిక్షలు మరియు జరిమానాలు చెల్లించిన తర్వాత రాజ్యం నుండి ప్రవాసులను బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న షిప్మెంట్లో నిందితులు సైకోట్రోపిక్ యాంఫెటమైన్ (క్యాప్గాన్), 3,42,000 మాత్రలు తీసుకువచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. గ్యాంగ్ లీడర్గా ఉన్న అరబ్ జాతీయుడు సౌదీ అరేబియాకు షిప్మెంట్ వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించారు. ఇతర నిందితులను షిప్మెంట్ స్వీకరించడానికి వచ్చిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ముఠా నాయకుడు రాజ్యానికి తిరిగి వచ్చాక అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









