సౌదీ, ఇద్దరు ప్రవాసులకు మొత్తం 55 సంవత్సరాల జైలు శిక్ష
- November 16, 2023
జెడ్డా: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు సౌదీ కోర్టు ఒక సౌదీ పౌరుడు, ఇద్దరు అరబ్ జాతీయులకు మొత్తం 55 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, దోషులలో ఒకరికి 25 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించగా.. మరో ఇద్దరికి ఒక్కొక్కరికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అలాగే కోర్టు దోషులకు SR300000 జరిమానా విధించింది. జైలు శిక్షలు మరియు జరిమానాలు చెల్లించిన తర్వాత రాజ్యం నుండి ప్రవాసులను బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న షిప్మెంట్లో నిందితులు సైకోట్రోపిక్ యాంఫెటమైన్ (క్యాప్గాన్), 3,42,000 మాత్రలు తీసుకువచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. గ్యాంగ్ లీడర్గా ఉన్న అరబ్ జాతీయుడు సౌదీ అరేబియాకు షిప్మెంట్ వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించారు. ఇతర నిందితులను షిప్మెంట్ స్వీకరించడానికి వచ్చిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ముఠా నాయకుడు రాజ్యానికి తిరిగి వచ్చాక అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







