ఇజ్రాయెల్ చేరుకున్న13 ఇజ్రాయిలీలు, 4 థాయ్ జాతీయులు
- November 27, 2023
యూఏఈ: 13 మంది ఇజ్రాయెల్లు మరియు నలుగురు థాయ్ జాతీయులను రెండో విడతలో హమాస్ విడుదల చేసింది. వారంతా ఆదివారం ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఈజిప్ట్ మరియు ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా బందీల అప్పగింత, గాజాలోకి సహాయ సామగ్రి తరలింపు ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది ఖైదీలకు బదులుగా హమాస్ 50 మంది బందీలను విడుదల చేయనుంది. హమాస్ బందీలను శనివారం అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీకి అప్పగించింది. విడుదలైన 13 మంది ఇజ్రాయెల్లలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. విడుదల చేయబడిన బందీలు ఇజ్రాయెల్లోని ఆసుపత్రులకు తరలించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనియన్లను రెండు జైళ్ల నుండి విడుదల చేసిందని పాలస్తీనా వార్తా సంస్థ WAFA వెల్లడించింది. హమాస్ చెరలో 240 మంది బందీలుగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









