ఇజ్రాయెల్ చేరుకున్న13 ఇజ్రాయిలీలు, 4 థాయ్ జాతీయులు
- November 27, 2023
యూఏఈ: 13 మంది ఇజ్రాయెల్లు మరియు నలుగురు థాయ్ జాతీయులను రెండో విడతలో హమాస్ విడుదల చేసింది. వారంతా ఆదివారం ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఈజిప్ట్ మరియు ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా బందీల అప్పగింత, గాజాలోకి సహాయ సామగ్రి తరలింపు ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది ఖైదీలకు బదులుగా హమాస్ 50 మంది బందీలను విడుదల చేయనుంది. హమాస్ బందీలను శనివారం అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీకి అప్పగించింది. విడుదలైన 13 మంది ఇజ్రాయెల్లలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. విడుదల చేయబడిన బందీలు ఇజ్రాయెల్లోని ఆసుపత్రులకు తరలించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనియన్లను రెండు జైళ్ల నుండి విడుదల చేసిందని పాలస్తీనా వార్తా సంస్థ WAFA వెల్లడించింది. హమాస్ చెరలో 240 మంది బందీలుగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







