ఇజ్రాయెల్ చేరుకున్న13 ఇజ్రాయిలీలు, 4 థాయ్ జాతీయులు
- November 27, 2023
యూఏఈ: 13 మంది ఇజ్రాయెల్లు మరియు నలుగురు థాయ్ జాతీయులను రెండో విడతలో హమాస్ విడుదల చేసింది. వారంతా ఆదివారం ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఈజిప్ట్ మరియు ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా బందీల అప్పగింత, గాజాలోకి సహాయ సామగ్రి తరలింపు ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది ఖైదీలకు బదులుగా హమాస్ 50 మంది బందీలను విడుదల చేయనుంది. హమాస్ బందీలను శనివారం అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీకి అప్పగించింది. విడుదలైన 13 మంది ఇజ్రాయెల్లలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. విడుదల చేయబడిన బందీలు ఇజ్రాయెల్లోని ఆసుపత్రులకు తరలించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనియన్లను రెండు జైళ్ల నుండి విడుదల చేసిందని పాలస్తీనా వార్తా సంస్థ WAFA వెల్లడించింది. హమాస్ చెరలో 240 మంది బందీలుగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







