ఒమన్కు భారతదేశం కీలకమైన ట్రావెల్ మార్కెట్
- November 27, 2023
మస్కట్: భారతదేశంలో తన కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు మరియు విస్తరించేందుకు సలామ్ ఎయిర్ ఇటీవలి ప్రకటన ఒమన్లోని ప్రవాస భారతీయులలో ఉత్సాహాన్ని నింపింది. డిసెంబర్ 16 నుండి హైదరాబాద్, లక్నో, త్రివేండ్రం, కాలికట్ మరియు జైపూర్తో సహా భారతీయ ముఖ్య నగరాలకు డైరెక్ట్ విమానాలను నడుపనుంది. ఈ కొత్త గమ్యస్థానాల గురించి ఎయిర్లైన్ యాక్టింగ్ సీఈఓ, కెప్టెన్ అహ్మద్ అల్ షిధానీ వివరించారు. సలామ్ ఎయిర్కు భారతదేశం ఒక కీలకమైన మార్కెట్ అని కెప్టెన్ తెలిపారు. ఒమన్ మరియు GCC ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో భారతీయ ప్రవాసు ఉన్నారని, ఈ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడం, సాంస్కృతిక మరియు వ్యాపార మార్పిడిని పెంపొందించడంలో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ ప్రభావాన్ని చూపుతుందని ఒక ఇంటర్వ్యూలో అల్ షిధాని పేర్కొన్నారు. ప్రయాణీకులకు మరిన్ని ప్రయాణ ఎంపికలను అందించడం, ఈ ప్రాంతంలో ట్రావెల్ హబ్గా ఒమన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఈ కొత్త మార్గాలు కీలక భూమికి వహిస్తాయని వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఒమన్ పర్యాటక పరిశ్రమకు గణనీయంగా దోహదపడతాయన్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







