ఒమన్కు భారతదేశం కీలకమైన ట్రావెల్ మార్కెట్
- November 27, 2023
మస్కట్: భారతదేశంలో తన కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు మరియు విస్తరించేందుకు సలామ్ ఎయిర్ ఇటీవలి ప్రకటన ఒమన్లోని ప్రవాస భారతీయులలో ఉత్సాహాన్ని నింపింది. డిసెంబర్ 16 నుండి హైదరాబాద్, లక్నో, త్రివేండ్రం, కాలికట్ మరియు జైపూర్తో సహా భారతీయ ముఖ్య నగరాలకు డైరెక్ట్ విమానాలను నడుపనుంది. ఈ కొత్త గమ్యస్థానాల గురించి ఎయిర్లైన్ యాక్టింగ్ సీఈఓ, కెప్టెన్ అహ్మద్ అల్ షిధానీ వివరించారు. సలామ్ ఎయిర్కు భారతదేశం ఒక కీలకమైన మార్కెట్ అని కెప్టెన్ తెలిపారు. ఒమన్ మరియు GCC ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో భారతీయ ప్రవాసు ఉన్నారని, ఈ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడం, సాంస్కృతిక మరియు వ్యాపార మార్పిడిని పెంపొందించడంలో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ ప్రభావాన్ని చూపుతుందని ఒక ఇంటర్వ్యూలో అల్ షిధాని పేర్కొన్నారు. ప్రయాణీకులకు మరిన్ని ప్రయాణ ఎంపికలను అందించడం, ఈ ప్రాంతంలో ట్రావెల్ హబ్గా ఒమన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఈ కొత్త మార్గాలు కీలక భూమికి వహిస్తాయని వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఒమన్ పర్యాటక పరిశ్రమకు గణనీయంగా దోహదపడతాయన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







