ఒమన్కు భారతదేశం కీలకమైన ట్రావెల్ మార్కెట్
- November 27, 2023
మస్కట్: భారతదేశంలో తన కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు మరియు విస్తరించేందుకు సలామ్ ఎయిర్ ఇటీవలి ప్రకటన ఒమన్లోని ప్రవాస భారతీయులలో ఉత్సాహాన్ని నింపింది. డిసెంబర్ 16 నుండి హైదరాబాద్, లక్నో, త్రివేండ్రం, కాలికట్ మరియు జైపూర్తో సహా భారతీయ ముఖ్య నగరాలకు డైరెక్ట్ విమానాలను నడుపనుంది. ఈ కొత్త గమ్యస్థానాల గురించి ఎయిర్లైన్ యాక్టింగ్ సీఈఓ, కెప్టెన్ అహ్మద్ అల్ షిధానీ వివరించారు. సలామ్ ఎయిర్కు భారతదేశం ఒక కీలకమైన మార్కెట్ అని కెప్టెన్ తెలిపారు. ఒమన్ మరియు GCC ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో భారతీయ ప్రవాసు ఉన్నారని, ఈ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడం, సాంస్కృతిక మరియు వ్యాపార మార్పిడిని పెంపొందించడంలో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ ప్రభావాన్ని చూపుతుందని ఒక ఇంటర్వ్యూలో అల్ షిధాని పేర్కొన్నారు. ప్రయాణీకులకు మరిన్ని ప్రయాణ ఎంపికలను అందించడం, ఈ ప్రాంతంలో ట్రావెల్ హబ్గా ఒమన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఈ కొత్త మార్గాలు కీలక భూమికి వహిస్తాయని వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఒమన్ పర్యాటక పరిశ్రమకు గణనీయంగా దోహదపడతాయన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









