భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మలేషియా
- November 27, 2023
డిసెంబర్ 1 నుంచి భారత్ నుంచి వచ్చే సందర్శకులకు 30 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తామని మలేషియా ఆదివారం తెలిపింది. శ్రీలంక మరియు థాయ్లాండ్ తర్వాత భారతీయ పౌరులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మూడవ ఆసియా దేశంగా మలేషియా నిలిచింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, టర్కీ మరియు జోర్డాన్ నుండి వచ్చే ప్రయాణికులు వీసా మినహాయింపును పొందుతున్నారు. అయితే వీసా మినహాయింపు సెక్యూరిటీ క్లియరెన్స్కు లోబడి ఉంటుందని ఆదేశ ప్రధాని చెప్పారు. నేర చరిత్ర, హింసాత్మక ప్రమాదం ఉన్నవారికి వీసా లభించదని ఆయన తెలిపారు. 2022లో RM 86.22 బిలియన్ల (USD 19.63 బిలియన్లు) మొత్తం వాణిజ్యంతో భారతదేశం మలేషియా 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇది 2021లో నమోదైన విలువతో పోలిస్తే 23.6 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







