భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మలేషియా
- November 27, 2023
డిసెంబర్ 1 నుంచి భారత్ నుంచి వచ్చే సందర్శకులకు 30 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తామని మలేషియా ఆదివారం తెలిపింది. శ్రీలంక మరియు థాయ్లాండ్ తర్వాత భారతీయ పౌరులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మూడవ ఆసియా దేశంగా మలేషియా నిలిచింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, టర్కీ మరియు జోర్డాన్ నుండి వచ్చే ప్రయాణికులు వీసా మినహాయింపును పొందుతున్నారు. అయితే వీసా మినహాయింపు సెక్యూరిటీ క్లియరెన్స్కు లోబడి ఉంటుందని ఆదేశ ప్రధాని చెప్పారు. నేర చరిత్ర, హింసాత్మక ప్రమాదం ఉన్నవారికి వీసా లభించదని ఆయన తెలిపారు. 2022లో RM 86.22 బిలియన్ల (USD 19.63 బిలియన్లు) మొత్తం వాణిజ్యంతో భారతదేశం మలేషియా 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇది 2021లో నమోదైన విలువతో పోలిస్తే 23.6 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







