ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన క్రౌన్ ప్రిన్స్, బ్రెజిల్ ప్రెసిడెంట్
- November 29, 2023
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మంగళవారం రియాద్లో అధికారిక చర్చలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఉమ్మడి సమన్వయం వంటి అంశాలను వారు సమీక్షించారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి రెండు దేశాలలో మంచి పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. అంతకుముందు రియాద్లోని అల్ యమామా ప్యాలెస్లో బ్రెజిల్ అధ్యక్షుడికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం పలికారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిస్థితులలో పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య ఇంధన రంగంలో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్







