ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన క్రౌన్ ప్రిన్స్, బ్రెజిల్ ప్రెసిడెంట్
- November 29, 2023
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మంగళవారం రియాద్లో అధికారిక చర్చలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఉమ్మడి సమన్వయం వంటి అంశాలను వారు సమీక్షించారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి రెండు దేశాలలో మంచి పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. అంతకుముందు రియాద్లోని అల్ యమామా ప్యాలెస్లో బ్రెజిల్ అధ్యక్షుడికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం పలికారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిస్థితులలో పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య ఇంధన రంగంలో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









