ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్

- June 29, 2026 , by Maagulf
ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌కు సంబంధించిన కీలక సమావేశం మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, సమావేశానికి సంబంధించిన ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు.

సోమవారం సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందిస్తూ, "ఇరాన్ సమావేశం కోరింది. రేపు దోహాలో ఆ సమావేశం జరుగుతుంది" అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఏ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు, ఎలాంటి అంశాలపై చర్చ జరగనుంది అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

అమెరికా–ఇరాన్ సంబంధాలు ఉద్రిక్తంగా కొనసాగుతున్న సమయంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, సమావేశంపై అమెరికా, ఇరాన్ లేదా ఖతార్ ప్రభుత్వాల నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com