తెలంగాణలో జనసేన బోణీ కొట్టేనా.?
- November 30, 2023
2019 ఎన్నికల్లో తెలంగాణలో జీరో సీట్లు దక్కాయ్ జనసేన పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ ఓ సీటు గెలుచుకుంది. అయితే, ఈసారి తెలంగాణలో జనసేన పుంజుకున్నట్టేనన్న చర్చ అంతటా జరుగుతోంది.
బీజేపీ సాయంతో జనసేన పార్టీ ఎనిమిది చోట్ల తెలంగాణలో పోటీ చేస్తోంది. మిగతా చోట్ల బీజేపీ, జనసేన సాయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు రెండు పార్టీల అభ్యర్థుల తరఫున.
అయితే, మరింత ప్రత్యేక దృష్టి కూకట్పల్లి మీద పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారం కూకట్పల్లిలో జనసేన తరఫున మరింత ఉధృతంగా జరిగింది. జనసేన అభ్యర్థి కూడా, మిగతా జనసేన అభ్యర్థుల కంటే జోరుగా ప్రచారం చేయడం గమనించదగ్గ అంశం.
తెలంగాణలో గనుక జనసేన బోణీ కొట్టగలిగితే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్లోనూ వుంటుందని జనసేన పార్టీ భావిస్తోంది. మొత్తం ఎనిమిది చోట్ల జనసేన పోటీ చేయగా, మూడు చోట్ల గట్టి పోటీ వుంటుందనీ, మిగతా చోట్ల నామ మాత్రంగానే జనసేనకు ఓట్లు పడతాయనీ అంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







