తెలంగాణలో జనసేన బోణీ కొట్టేనా.?
- November 30, 2023
2019 ఎన్నికల్లో తెలంగాణలో జీరో సీట్లు దక్కాయ్ జనసేన పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ ఓ సీటు గెలుచుకుంది. అయితే, ఈసారి తెలంగాణలో జనసేన పుంజుకున్నట్టేనన్న చర్చ అంతటా జరుగుతోంది.
బీజేపీ సాయంతో జనసేన పార్టీ ఎనిమిది చోట్ల తెలంగాణలో పోటీ చేస్తోంది. మిగతా చోట్ల బీజేపీ, జనసేన సాయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు రెండు పార్టీల అభ్యర్థుల తరఫున.
అయితే, మరింత ప్రత్యేక దృష్టి కూకట్పల్లి మీద పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారం కూకట్పల్లిలో జనసేన తరఫున మరింత ఉధృతంగా జరిగింది. జనసేన అభ్యర్థి కూడా, మిగతా జనసేన అభ్యర్థుల కంటే జోరుగా ప్రచారం చేయడం గమనించదగ్గ అంశం.
తెలంగాణలో గనుక జనసేన బోణీ కొట్టగలిగితే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్లోనూ వుంటుందని జనసేన పార్టీ భావిస్తోంది. మొత్తం ఎనిమిది చోట్ల జనసేన పోటీ చేయగా, మూడు చోట్ల గట్టి పోటీ వుంటుందనీ, మిగతా చోట్ల నామ మాత్రంగానే జనసేనకు ఓట్లు పడతాయనీ అంటున్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







