ఓటుకు నోటు.! ఓటర్లను కొనేస్తున్న కరెన్సీ నోట్లు.!
- November 30, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, కరెన్సీ నోటు డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారం ముగిశాక, ఓట్లను కొనేందుకు రాజకీయ పార్టీలు తమవైన వ్యూహాల్ని అమల్లోకి తెచ్చాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఓటర్లను కొనుగోలు చేయడం.. అనే రాజకీయ ఎత్తుగడని మాత్రం ఈసారి కూడా నిలువరించలేకపోవడం గమనించాల్సిన విషయం.
‘మీ ఓటుని అమ్ముకోవద్దు..’ అని ఎవరెంతలా నచ్చజెబుతున్నా, చాలామంది ఓటర్లు తమ ఓటుని నిర్మొహమాటంగా అమ్మేసుకుంటున్నారు. పైగా, తాము అడిగినంత రేటు ఇవ్వడంలేదంటూ ఓటర్లు మీడియాకెక్కుతుండడం కూడా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను కొనుగోలు చేయడంలో బిజీ అయిపోయాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ, చాటు మాటుగా ఓట్ల కొనుగోళ్ళు జరుగుతున్నాయి.
అయితే, ఇలా ఓట్లు అమ్ముకునేవారి సంఖ్య చాలా తక్కువగానే వుంటుందనే వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిది.! అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని కరెన్సీ నోటు అపహాస్యం చేస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







