ఓటుకు నోటు.! ఓటర్లను కొనేస్తున్న కరెన్సీ నోట్లు.!
- November 30, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, కరెన్సీ నోటు డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారం ముగిశాక, ఓట్లను కొనేందుకు రాజకీయ పార్టీలు తమవైన వ్యూహాల్ని అమల్లోకి తెచ్చాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఓటర్లను కొనుగోలు చేయడం.. అనే రాజకీయ ఎత్తుగడని మాత్రం ఈసారి కూడా నిలువరించలేకపోవడం గమనించాల్సిన విషయం.
‘మీ ఓటుని అమ్ముకోవద్దు..’ అని ఎవరెంతలా నచ్చజెబుతున్నా, చాలామంది ఓటర్లు తమ ఓటుని నిర్మొహమాటంగా అమ్మేసుకుంటున్నారు. పైగా, తాము అడిగినంత రేటు ఇవ్వడంలేదంటూ ఓటర్లు మీడియాకెక్కుతుండడం కూడా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను కొనుగోలు చేయడంలో బిజీ అయిపోయాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ, చాటు మాటుగా ఓట్ల కొనుగోళ్ళు జరుగుతున్నాయి.
అయితే, ఇలా ఓట్లు అమ్ముకునేవారి సంఖ్య చాలా తక్కువగానే వుంటుందనే వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిది.! అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని కరెన్సీ నోటు అపహాస్యం చేస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







