ఓటుకు నోటు.! ఓటర్లను కొనేస్తున్న కరెన్సీ నోట్లు.!
- November 30, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, కరెన్సీ నోటు డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారం ముగిశాక, ఓట్లను కొనేందుకు రాజకీయ పార్టీలు తమవైన వ్యూహాల్ని అమల్లోకి తెచ్చాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఓటర్లను కొనుగోలు చేయడం.. అనే రాజకీయ ఎత్తుగడని మాత్రం ఈసారి కూడా నిలువరించలేకపోవడం గమనించాల్సిన విషయం.
‘మీ ఓటుని అమ్ముకోవద్దు..’ అని ఎవరెంతలా నచ్చజెబుతున్నా, చాలామంది ఓటర్లు తమ ఓటుని నిర్మొహమాటంగా అమ్మేసుకుంటున్నారు. పైగా, తాము అడిగినంత రేటు ఇవ్వడంలేదంటూ ఓటర్లు మీడియాకెక్కుతుండడం కూడా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను కొనుగోలు చేయడంలో బిజీ అయిపోయాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ, చాటు మాటుగా ఓట్ల కొనుగోళ్ళు జరుగుతున్నాయి.
అయితే, ఇలా ఓట్లు అమ్ముకునేవారి సంఖ్య చాలా తక్కువగానే వుంటుందనే వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిది.! అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని కరెన్సీ నోటు అపహాస్యం చేస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









