ఓటుకు నోటు.! ఓటర్లను కొనేస్తున్న కరెన్సీ నోట్లు.!
- November 30, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, కరెన్సీ నోటు డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారం ముగిశాక, ఓట్లను కొనేందుకు రాజకీయ పార్టీలు తమవైన వ్యూహాల్ని అమల్లోకి తెచ్చాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఓటర్లను కొనుగోలు చేయడం.. అనే రాజకీయ ఎత్తుగడని మాత్రం ఈసారి కూడా నిలువరించలేకపోవడం గమనించాల్సిన విషయం.
‘మీ ఓటుని అమ్ముకోవద్దు..’ అని ఎవరెంతలా నచ్చజెబుతున్నా, చాలామంది ఓటర్లు తమ ఓటుని నిర్మొహమాటంగా అమ్మేసుకుంటున్నారు. పైగా, తాము అడిగినంత రేటు ఇవ్వడంలేదంటూ ఓటర్లు మీడియాకెక్కుతుండడం కూడా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను కొనుగోలు చేయడంలో బిజీ అయిపోయాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ, చాటు మాటుగా ఓట్ల కొనుగోళ్ళు జరుగుతున్నాయి.
అయితే, ఇలా ఓట్లు అమ్ముకునేవారి సంఖ్య చాలా తక్కువగానే వుంటుందనే వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిది.! అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని కరెన్సీ నోటు అపహాస్యం చేస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









