తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..!
- November 30, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. డిసెంబర్ 3న ఫలితం వెలువడనుంది. ఈసారి ఓటరు దేవుడు ఎవరికి పట్టం కట్టాడు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అన్నది తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.
తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్కు ఓటు వేశారా? పోరుగడ్డలో బీజేపీ గెలవబోతున్న స్థానాలెన్ని? ప్రజా తీర్పు ఏ విధంగా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..
సీఎన్ఎన్-న్యూస్ 18
బీఆర్ఎస్ 48
కాంగ్రెస్+ 56
బీజేపీ+ 10
ఎంఐఎం 05
థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్..
బీఆర్ఎస్ 61-68
కాంగ్రెస్+ 34-10
బీజేపీ+ 03-05
ఇతరులు 05-08
సర్వే సంస్థ – పొలిటికల్ గ్రాఫ్
బీఆర్ఎస్ – 68
కాంగ్రెస్+ – 38
బీజేపీ+ – 05
ఇతరులు – 08
సర్వే సంస్థ – ఆత్మ సాక్షి
బీఆర్ఎస్ – 58-63
కాంగ్రెస్+ – 48-51
బీజేపీ – 07-08
ఇతరులు – 07-09
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







