గాజా సంధిని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
- November 30, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ అధికారులు గురువారం గాజా యుద్ధంలో విరామం(సంధి) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరింత మంది బందీలను మరియు ఖైదీలను విడుదల చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ (ఎక్స్) వేదికగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాదాపు 240 మందిని కిడ్నాప్ చేసింది. హమాస్ అధికారుల ప్రకారం.. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 15,000 మంది మరణించారు. గాజా ఉత్తర ప్రాంతంలోని వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. నవంబర్ 24న సంధి ప్రారంభమైనప్పటి నుండి 210 మంది పాలస్తీనా ఖైదీలను, 70 మంది ఇజ్రాయెలీ బందీలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. వీరిలో దాదాపు 30 మంది విదేశీయులు ఉన్నాయి. బందీలను విడిపించేందుకు ఉద్దేశించిన తాత్కాలిక విరమణగా సంధిని చూస్తున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నిజమైన మానవతావాద కాల్పుల విరమణ కావాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!









