గాజా సంధిని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
- November 30, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ అధికారులు గురువారం గాజా యుద్ధంలో విరామం(సంధి) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరింత మంది బందీలను మరియు ఖైదీలను విడుదల చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ (ఎక్స్) వేదికగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాదాపు 240 మందిని కిడ్నాప్ చేసింది. హమాస్ అధికారుల ప్రకారం.. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 15,000 మంది మరణించారు. గాజా ఉత్తర ప్రాంతంలోని వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. నవంబర్ 24న సంధి ప్రారంభమైనప్పటి నుండి 210 మంది పాలస్తీనా ఖైదీలను, 70 మంది ఇజ్రాయెలీ బందీలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. వీరిలో దాదాపు 30 మంది విదేశీయులు ఉన్నాయి. బందీలను విడిపించేందుకు ఉద్దేశించిన తాత్కాలిక విరమణగా సంధిని చూస్తున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నిజమైన మానవతావాద కాల్పుల విరమణ కావాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







