కుప్ప కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్లు మృతి
- December 04, 2023
తెలంగాణ: శిక్షణా యుద్ధ విమానం కుప్పకూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలెట్లు మరణించారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా పిలాటస్ పిసి 7 ఎంకె 11 విమానం హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) నుండి బయలుదేరినట్లు వైమానిక దళం తెలిపింది. విమానం కూలిపోయే సమయంలో ఓ ట్రైనర్, ట్రైనీ పైలెట్లు ఉన్నారని, ప్రమాదంలో వారిద్దరూ మరణించారని వైమానిక దళం (IFA) ‘ఎక్స్’ లో పేర్కొంది. ఒకే ఇంజన్ కలిగిన పిలాటస్ పిసి 7 ఎంకె 11 విమానాన్ని ఐఎఎఫ్ పైలెట్లు శిక్షణ పొందేందుకు వినియోగిస్తుంటారు.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







