కుప్ప కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్లు మృతి
- December 04, 2023
తెలంగాణ: శిక్షణా యుద్ధ విమానం కుప్పకూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలెట్లు మరణించారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా పిలాటస్ పిసి 7 ఎంకె 11 విమానం హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) నుండి బయలుదేరినట్లు వైమానిక దళం తెలిపింది. విమానం కూలిపోయే సమయంలో ఓ ట్రైనర్, ట్రైనీ పైలెట్లు ఉన్నారని, ప్రమాదంలో వారిద్దరూ మరణించారని వైమానిక దళం (IFA) ‘ఎక్స్’ లో పేర్కొంది. ఒకే ఇంజన్ కలిగిన పిలాటస్ పిసి 7 ఎంకె 11 విమానాన్ని ఐఎఎఫ్ పైలెట్లు శిక్షణ పొందేందుకు వినియోగిస్తుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









