72 శాతం తగ్గిన విమాన ఛార్జీలు!
- December 04, 2023
యూఏఈ: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే, యూఏఈ నుండి అనేక గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు 2022తో పోల్చితే ఈ సంవత్సరం 72 శాతం తగ్గుదల నమోదైంది. "ధరలు డైనమిక్గా ఉంటాయి. అయితే విమానయాన సంస్థలు ప్రయాణికుల కోసం పోటీపడుతున్నందున చాలా ఆఫర్లు ప్రకటిస్తున్నారు." అని ట్రావెల్ సెర్చ్ ఇంజిన్ మరియు ఏజెన్సీ స్కైస్కానర్లో పనిచేసే హ్యూ ఐట్కెన్ తెలిపారు. ఏజెన్సీ యొక్క ట్రావెల్ ట్రెండ్స్ 2024 నివేదిక ప్రకారం.. గత సంవత్సరంతో పోల్చితే 2023లో యూఏఈ నుండి అతిపెద్ద విమాన ఛార్జీలు తగ్గిన గమ్యస్థానాలలో యునైటెడ్ స్టేట్స్లోని ఓర్లాండో (72 శాతం), మాలే, మాల్దీవులు (58 శాతం), రోమ్, ఇటలీ (52 శాతం), మ్యూనిచ్, జర్మనీ (47 శాతం), బ్యాంకాక్, థాయిలాండ్, అంటల్య, టర్కియే, ఇండోనేషియాలోని బాలిలో 17 -23 శాతం మధ్య ధర తగ్గింది. 2023 Q4లో యూఏఈ నుండి విమాన ప్రయాణాలు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 31 శాతం పెరిగాయి. ఈ శీతాకాలపు సెలవుల్లో ప్రయాణానికి డిమాండ్ పెరుగుతుందని ట్రావెల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూఏఈ ఆధారిత ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ముసాఫిర్ మాట్లాడుతూ.. గత నాలుగు నెలల్లో ప్రధాన ప్రపంచ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలలో తగ్గింపు కనిపించిందన్నారు. సెప్టెంబర్లో, గత నెలలతో పోలిస్తే విమాన ఛార్జీలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయని, సగటున, విమాన ఛార్జీలు 15-20 శాతం తగ్గాయని ఏజెన్సీలోని ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ రషీదా జాహిద్ తెలిపారు. మెరుగైన డీల్ల కోసం ముందుగా ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవాలని ఆమె నివాసితులకు సూచించారు.
తాజా వార్తలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు









