దోహాలో జిసిసి సమ్మిట్.. గాజా వివాదంపై చర్చ
- December 05, 2023
దోహా: ఖతార్ రాజధాని దోహాలో జరగనున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల సుప్రీం కౌన్సిల్ 44వ శిఖరాగ్ర సమావేశంలో గాజా వివాదం, ఈ ప్రాంతంలోని ఇతర ప్రధాన పరిణామాలపై చర్చించనున్నారు. ఇజ్రాయెల్ ముట్టడిలో ఉన్న గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైనికుల దౌర్జన్యం చేస్తున్న తరుణంలో జరగనున్న ఈ సమ్మిట్కు జిసిసిలోని ఆరు సభ్య దేశాల నాయకులు హాజరవుతారు. ప్రధాన అంతర్జాతీయ పరిణామాలపై కూడా నేతలు చర్చించనున్నారు. ఆదివారం జరిగిన జిసిసి విదేశాంగ మంత్రుల 158వ సన్నాహక సమావేశం సదస్సు ఎజెండాను ఖరారు చేసింది. మంత్రివర్గ సమావేశానికి హాజరైన సౌదీ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ నాయకత్వం వహించారు. మంత్రివర్గ సమావేశానికి ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ అధ్యక్షత వహించారు జిసిసి రాష్ట్రాల విదేశాంగ మంత్రులు, జిసిసి సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్







