దోహాలో జిసిసి సమ్మిట్.. గాజా వివాదంపై చర్చ
- December 05, 2023
దోహా: ఖతార్ రాజధాని దోహాలో జరగనున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల సుప్రీం కౌన్సిల్ 44వ శిఖరాగ్ర సమావేశంలో గాజా వివాదం, ఈ ప్రాంతంలోని ఇతర ప్రధాన పరిణామాలపై చర్చించనున్నారు. ఇజ్రాయెల్ ముట్టడిలో ఉన్న గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైనికుల దౌర్జన్యం చేస్తున్న తరుణంలో జరగనున్న ఈ సమ్మిట్కు జిసిసిలోని ఆరు సభ్య దేశాల నాయకులు హాజరవుతారు. ప్రధాన అంతర్జాతీయ పరిణామాలపై కూడా నేతలు చర్చించనున్నారు. ఆదివారం జరిగిన జిసిసి విదేశాంగ మంత్రుల 158వ సన్నాహక సమావేశం సదస్సు ఎజెండాను ఖరారు చేసింది. మంత్రివర్గ సమావేశానికి హాజరైన సౌదీ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ నాయకత్వం వహించారు. మంత్రివర్గ సమావేశానికి ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ అధ్యక్షత వహించారు జిసిసి రాష్ట్రాల విదేశాంగ మంత్రులు, జిసిసి సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







