గాజాలో తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ డిమాండ్
- December 08, 2023
యూఏఈ: గాజాలో తక్షణ కాల్పుల విరమణను చేపట్టాలని ఐరాస భద్రతా మండలికి కొత్త తీర్మానాన్ని సమర్పించినట్లు యూఏఈ ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ తన తాజా ముసాయిదా తీర్మానంలో యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో తీవ్ర సంక్షోభానికి ప్రతిస్పందనగా తక్షణ మానవతావాద కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. "గాజా స్ట్రిప్లో పరిస్థితి విపత్తు మరియు కోలుకోలేని స్థితికి దగ్గరగా ఉంది. మేము వేచి ఉండలేము. మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేయడానికి కౌన్సిల్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది" అని UNకు యూఏఈ మిషన్ X లో ఒక పోస్ట్లో పేర్కొంది. విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ..పాలస్తీనా ప్రజల అధ్వాన్నమైన బాధల పట్ల ఐక్యరాజ్యసమితి స్పందించాలని సూచిస్తూ తీర్మానం సమర్పించినట్లు వెల్లడించారు. యూఏఈ మిషన్ దాని ముసాయిదా తీర్మానానికి అరబ్, OIC (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్) గ్రూప్ మద్దతు ఉందని పేర్కొన్నారు. UNలోని 22 దేశాల అరబ్ గ్రూప్ కాల్పుల విరమణకు గట్టిగా మద్దతుగా నిలిచాయి. కానీ ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన అమిరాక భద్రతా మండలిలో వీటో అధికారం కలిగి ఉంది. కాల్పుల విరమణకు అది మద్దతు ఇవ్వలేదు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







