గాజాలో తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ డిమాండ్
- December 08, 2023
యూఏఈ: గాజాలో తక్షణ కాల్పుల విరమణను చేపట్టాలని ఐరాస భద్రతా మండలికి కొత్త తీర్మానాన్ని సమర్పించినట్లు యూఏఈ ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ తన తాజా ముసాయిదా తీర్మానంలో యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో తీవ్ర సంక్షోభానికి ప్రతిస్పందనగా తక్షణ మానవతావాద కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. "గాజా స్ట్రిప్లో పరిస్థితి విపత్తు మరియు కోలుకోలేని స్థితికి దగ్గరగా ఉంది. మేము వేచి ఉండలేము. మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేయడానికి కౌన్సిల్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది" అని UNకు యూఏఈ మిషన్ X లో ఒక పోస్ట్లో పేర్కొంది. విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ..పాలస్తీనా ప్రజల అధ్వాన్నమైన బాధల పట్ల ఐక్యరాజ్యసమితి స్పందించాలని సూచిస్తూ తీర్మానం సమర్పించినట్లు వెల్లడించారు. యూఏఈ మిషన్ దాని ముసాయిదా తీర్మానానికి అరబ్, OIC (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్) గ్రూప్ మద్దతు ఉందని పేర్కొన్నారు. UNలోని 22 దేశాల అరబ్ గ్రూప్ కాల్పుల విరమణకు గట్టిగా మద్దతుగా నిలిచాయి. కానీ ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన అమిరాక భద్రతా మండలిలో వీటో అధికారం కలిగి ఉంది. కాల్పుల విరమణకు అది మద్దతు ఇవ్వలేదు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









