ఖతార్ పబ్లిక్ సెక్టార్లో ఐదు గంటల పనిదినాలు
- May 27, 2016
ఖతార్ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులు రంజాన్ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తారని అధికారులు వెల్లడించారు. జూన్ 5 నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కానుంది. అయితే రోజుకి ఐదు గంటల పనిదినాలు ప్రైవేటు కంపెనీలకు వర్తించవు. ఖతారీ చట్టం ప్రకారం ఈ సంస్థలు రోజుకి 6 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఇండిపెండెంట్ స్కూల్స్ ఇప్పటికే పని గంటల్ని తగ్గించాయి. మే 15 నుంచి ప్రభుత్వ కిండర్గార్టెన్స్ ఉదయం 11 గంటలకు పూర్తయిపోతాయి. ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్కి 11.45 నిమిషాల వరకు, సెకెండరీ స్టూడెంట్స్ 12.35 గంటలకు పూర్తవుతుంది. ఈసారి గతంలోకన్నా భిన్నంగా సమ్మర్ హాలీడేస్ చాలా ఎక్కువగా లభించనున్నాయి. రంజాన్ సెలవులతో కలుపుకుంటే లాంగ్ సమ్మర్ హాలిడేస్ ఉండనున్నట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







