మరోసారి కలవరపెడుతున్న కోవిడ్
- December 11, 2023
న్యూఢిల్లీ: కరోనా కనుమరుగైపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే దేశ ప్రజానీకాన్ని మరోసారి కరోనా కలవరపెడుతోంది. అనూహ్యంగా దేశంలో కరోనా కేసులు పెరిగాయి. కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తంగా 895 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వేరియంట్ ఇన్ప్లూయెంజా వైరస్ వల్లే శీతాకాలంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమని కేంద్రప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా కేసులు పెరగడంతో శీతాకాలంలో అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.44 కోట్ల మంది ఈ వైరస్ బారినపడ్డారు. దాదాపు 5,33,306 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.19గా ఉంది. ఇక కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా.. ఇప్పటివరకు కేంద్రం 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









