శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..
- December 11, 2023
శంషాబాద్: దుబాయ్ నుంచి ఓ వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి హైదరాబాద్కు విమానంలో వచ్చిన ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి పై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు బంగారాన్ని వైర్ రూపంలో తయారు చేసి మెటాలిక్ షోకేస్లో అమర్చుకొని అక్రమంగా దాచిపెట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని రూ.27.92 లక్షల విలువ చేసే 449 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని.. అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా







