శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..

- December 11, 2023 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..

శంషాబాద్‌: దుబాయ్ నుంచి ఓ వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్‌ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ప్రయాణికులను శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి పై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్‌ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు బంగారాన్ని వైర్‌ రూపంలో తయారు చేసి మెటాలిక్‌ షోకేస్‌లో అమర్చుకొని అక్రమంగా దాచిపెట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని రూ.27.92 లక్షల విలువ చేసే 449 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని.. అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com