శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..
- December 11, 2023
శంషాబాద్: దుబాయ్ నుంచి ఓ వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి హైదరాబాద్కు విమానంలో వచ్చిన ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి పై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు బంగారాన్ని వైర్ రూపంలో తయారు చేసి మెటాలిక్ షోకేస్లో అమర్చుకొని అక్రమంగా దాచిపెట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని రూ.27.92 లక్షల విలువ చేసే 449 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని.. అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









