8 సంవత్సరాల తర్వాత సౌదీకి ఇరాన్ ఉమ్రా యాత్రికులు
- December 14, 2023
టెహ్రాన్: ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఉమ్రా చేసేందుకు ఇరాన్ యాత్రికులు డిసెంబర్ 19న సౌదీ అరేబియాకు చేరుకుంటారు. ఈ విషయాన్ని ఇరాన్ హజ్ అండ్ తీర్థయాత్ర సంస్థ అధిపతి అబ్బాస్ హొస్సేనీ ప్రకటించారు. టెహ్రాన్లో మీడియాతో హోస్సేనీ మాట్లాడుతూ.. మొదటి బ్యాచ్లో 550 మంది యాత్రికులు ఉంటారని తెలిపారు. "యాత్రికులు డిసెంబర్ 19న మక్కాలోని దేవుని హౌస్కి వెళతారు. యాత్రికులు సౌదీ అరేబియాలో 10 రోజులు ఉంటారు. అందులో ఐదు రోజులు మక్కాలో.. ఐదు రోజులు మదీనాలో ఉంటారు." అని వివరించారు. మొత్తంగా ఈ సీజన్ లో 550 బ్యాచ్లలో మొత్తం 70,000 మంది ఇరాన్ యాత్రికులు ఉమ్రా చేస్తారని హోస్సేనీ చెప్పారు. పవిత్ర రమదాన్ మాసానికి ముందు ఫిబ్రవరి 29 వరకు ఉమ్రా యాత్రికులు ప్రయాణాలు ఉంటాయన్నారు. ఉమ్రా తీర్థయాత్రలో పాల్గొనేందుకు 5.7 మిలియన్ల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇరాన్ - సౌదీ అరేబియా మార్చి 2023లో చైనా మధ్యవర్తిత్వ ఒప్పందం ద్వారా దౌత్య సంబంధాలను పునఃస్థాపించుకున్నాయి. 2016లో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
తాజా వార్తలు
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..







