8 సంవత్సరాల తర్వాత సౌదీకి ఇరాన్ ఉమ్రా యాత్రికులు
- December 14, 2023
టెహ్రాన్: ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఉమ్రా చేసేందుకు ఇరాన్ యాత్రికులు డిసెంబర్ 19న సౌదీ అరేబియాకు చేరుకుంటారు. ఈ విషయాన్ని ఇరాన్ హజ్ అండ్ తీర్థయాత్ర సంస్థ అధిపతి అబ్బాస్ హొస్సేనీ ప్రకటించారు. టెహ్రాన్లో మీడియాతో హోస్సేనీ మాట్లాడుతూ.. మొదటి బ్యాచ్లో 550 మంది యాత్రికులు ఉంటారని తెలిపారు. "యాత్రికులు డిసెంబర్ 19న మక్కాలోని దేవుని హౌస్కి వెళతారు. యాత్రికులు సౌదీ అరేబియాలో 10 రోజులు ఉంటారు. అందులో ఐదు రోజులు మక్కాలో.. ఐదు రోజులు మదీనాలో ఉంటారు." అని వివరించారు. మొత్తంగా ఈ సీజన్ లో 550 బ్యాచ్లలో మొత్తం 70,000 మంది ఇరాన్ యాత్రికులు ఉమ్రా చేస్తారని హోస్సేనీ చెప్పారు. పవిత్ర రమదాన్ మాసానికి ముందు ఫిబ్రవరి 29 వరకు ఉమ్రా యాత్రికులు ప్రయాణాలు ఉంటాయన్నారు. ఉమ్రా తీర్థయాత్రలో పాల్గొనేందుకు 5.7 మిలియన్ల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇరాన్ - సౌదీ అరేబియా మార్చి 2023లో చైనా మధ్యవర్తిత్వ ఒప్పందం ద్వారా దౌత్య సంబంధాలను పునఃస్థాపించుకున్నాయి. 2016లో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
తాజా వార్తలు
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్









