ఏపీ విద్యార్థి ఐఎస్ఐఎస్ వీడియోలో
- May 28, 2016
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను తమవైపు ఆకర్షిస్తున్నారు. తాజాగా వారు విడుదల చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. అమెరాకాలోని టెక్సాస్లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థితో ఇండియాలో దాడులు చేస్తామని వీడియో రికార్డ్ చేసి విడుదల చేశారు. మే 19న విడుదల చేసిన ఈ 22 నిమిషాల నిడివి గల వీడియోను పరిశోధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇందులో ఆరుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించింది.ఇందులో ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందిన మహ్మద్ సాజిత్ అలియాస్ బాబా సాజిద్, ఫారూక్ అల్ హిందీ అలియాస్ అబురషీద్ ఉన్నారు. మహారాష్ట్రలోని కళ్యాణ్కు చెందిన అబు సల్హా అల్ హిందీ, ఫహద్ షేక్ అలియాస్ అబు అమర్ అల్ హిందీ, థానేకు చెందిన అమన్ తాండ్లే అలియాస్ అబు సల్మాన్ అల్ హిందీ, షాహామ్ థాంకీ ఉన్నారు. దీంతో ఐఎస్ఐస్ లోచేరిన భారతీయుల సంఖ్య 25 నుంచి 40 చేరింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, ఐఎస్పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







