ముంబై - దోహా మధ్య నాన్-స్టాప్ ఫ్లైట్: విస్తారా
- December 17, 2023
గురుగ్రామ్: టాటా గ్రూప్ - సింగపూర్ ఎయిర్లైన్స్ మధ్య జాయింట్ వెంచర్ విస్తారా.. ముంబై -దోహా మధ్య వారానికి నాలుగు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. విస్తారా A321నియో ఎయిర్క్రాఫ్ట్లో నడిచే ప్రారంభ విమానం, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి డిసెంబర్ 15న 18:45 గంటలకు (IST) బయలుదేరి 20:30 గంటలకు (స్థానిక సమయం) దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇండియా-మధ్యప్రాచ్యం మధ్య ప్రయాణానికి డిమాండ్లో స్థిరమైన పెరుగుదలతో విస్తారా ఈ ప్రాంతంలో తన ఉనికిని విస్తరించుకోవడంపై దృష్టి సారించినట్లు విస్తారా వెల్లడించింది. ఎయిర్లైన్ ఇప్పటికే ఈ ప్రాంతంలోని అబుదాబి, దమ్మామ్, దుబాయ్, జెడ్డా మరియు మస్కట్ గమ్యస్థానాలకు నేరుగా కనెక్టివిటీని అందిస్తుందని విస్తారా సీఈఓ వినోద్ కణ్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







