అయోధ్య రామాలయం థీమ్తో డైమెండ్ నక్లెస్..
- December 19, 2023
అయోధ్య: భారత దేశ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఆసక్తిగా భక్తిభావంతో ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. శ్రీరామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రామాలయం గర్భగుడి వద్ద రామ లల్లాను ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే.. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని వజ్రాల వ్యాపారి డైమెండ్ నక్లెస్ ను తయారు చేశారు. అయోధ్య రామాలయం థీమ్ తో తయారు చేసిన ఈ డైమండ్ నక్లెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ డైమెండ్ నక్లెస్ కోసం సుమారు 5వేల అమెరికన్ వజ్రాలను వాడారు. దాదాపు రెండు కేజీల వెండితో ఈ నక్లెస్ ను రూపొందించారు. సూరత్ కు చెందిన రసేష్ జ్యువెలర్స్ ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించింది. 35రోజుల్లో 40 మంది కళాకారులు దీన్ని పూర్తి చేశారు. అయోధ్య రామాలయానికి బహుమతిగా ఈ డైమండ్ నక్లెస్ ను ఇవ్వనున్నట్లు వజ్రాల వ్యాపారి తెలిపారు. ఈ నక్లెస్ లో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుని విగ్రహాలు, రామ్ దర్బార్ తో పాటు జింకలు ఉన్నాయి.
వచ్చే ఏడాది జనవరి 22న భారీ వేడుకల మధ్య భక్తులకోసం రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. జనవరి 14 నుంచి జనవరి 22 వరకు అయోధ్య అమృత మహోత్సవ్ ను సూచిస్తుంది.
తాజా వార్తలు
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!
- ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల దగ్గర పార్కింగ్ వద్దు..!!









