యువ శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను అందివ్వాలి: ఇస్రో డైరెక్టర్ శ్రీకాంత్
- December 19, 2023
హైదరాబాద్: మనవ జీవన ప్రయాణం సాంకేతికతతోనే ఆరంభమవుతుందని చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు.
చంద్రయాన్-3తో ప్రపంచ దేశాలకు ఇస్రో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బిట్స్ పిలానీ క్యాంపస్లో సోమవారం సెన్సార్ టెక్నాలజీపై 16వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ మాట్లాడుతూ..యువ శాస్త్రవేత్తలు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రపంచానికి సాంకేతికతను అందించాలని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఫైబర్ ఆప్టిక్ గైరోస్కోప్ ఆధారిత సెన్సార్ ఉత్పత్తి విధానాన్ని వివరించారు. సెన్సింగ్ టెక్నాలజీ డొమైన్ పనిచేసే విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్ పిలానీ వైస్ చాన్సలర్ రాంగోపాల్రావు, బిట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..









