104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు..
- May 28, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీలోని పలు పట్టణాల్లో శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక, ఇతర దాడుల్లో 104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్య పై స్పష్టత లేదని పేర్కొన్నారు. మొదటగా టర్కీ స్థానిక మీడియాలో ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో టర్కీ అధికారులు శుక్రవారం రాత్రి నిర్వహించిన దాడుల ఆపరేషన్ పై స్పందించారు.అమెరికాతో పాటు తమ సేనలు యుద్ధవిమానాల ద్వారా, వైమానిక, భూభాగ విభాగాల సైన్యం బాంబు దాడులు, కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. ఉగ్రకార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా వినియోగిస్తు ఏడు పెద్ద భవంతులను ధ్వంసం చేశారు. ఇటీవల సిరియా సరిహద్దు ప్రాంతాల్లోనూ 21 మంది చనిపోవడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







