104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు..

- May 28, 2016 , by Maagulf
104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు  వెల్లడించారు..

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీలోని పలు పట్టణాల్లో శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక, ఇతర దాడుల్లో 104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్య పై స్పష్టత లేదని పేర్కొన్నారు. మొదటగా టర్కీ స్థానిక మీడియాలో ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో టర్కీ అధికారులు శుక్రవారం రాత్రి నిర్వహించిన దాడుల ఆపరేషన్ పై స్పందించారు.అమెరికాతో పాటు తమ సేనలు యుద్ధవిమానాల ద్వారా, వైమానిక, భూభాగ విభాగాల సైన్యం బాంబు దాడులు, కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. ఉగ్రకార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా వినియోగిస్తు ఏడు పెద్ద భవంతులను ధ్వంసం చేశారు. ఇటీవల సిరియా సరిహద్దు ప్రాంతాల్లోనూ 21 మంది చనిపోవడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com