పసిడి ,వెండి ధరలు మరింత దిగి వచ్చాయి

- May 28, 2016 , by Maagulf
పసిడి ,వెండి ధరలు మరింత దిగి వచ్చాయి

ఇటీవలి కాలంలో 30 వేలుదాటిన బంగారం ధరలు కొనుగోలు దారులను కలవరపర్చాయి. అయితే ఈ స్థాయిలో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న బంగారం ధరలు ఇక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమ్యాయి. దీంతో మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగింది. వరుసగా రెండవ రోజూ నష్టాలను నమోదు చేసిన పసిడి ,వెండి ధరలు శనివారం మరింత దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో 29 వేల దిగువకు చేరిన పుత్తడి ఇన్వెస్టర్లు ఊరిస్తోంది. రూపాయి, బలహీనత, అంతర్జాతీయ సంకేతాలు ఈ పరిణామానికి కారణమని మార్కెట్ విశ్లేషకుల భావన. అటు ఫెడ్ రెట్లను రాబోయే మరింత పెంచనున్నామని అమెరికా ఫెడరల్‌ రిజర్వు చైర్‌పర్సన్‌ జానెట్‌ ఎల్‌ ఎల్లెన్‌ ప్రకటించారు. దీంతో డాలర్ కు మరింత డిమాండ్ పెరిగి పసిడికి డిమాండ్ క్షీణించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com