దుబాయ్ లో ఘనంగా ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
- December 22, 2023
దుబాయ్: దుబాయ్ లో YSRCP NRI కమిటీ అడ్వైజర్ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్ఆర్సిపి యువ నాయకులు మహమ్మద్ జిలాన్ భాష,తరపట్ల మోహన్ ,రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సయ్యద్ నాసర్, చిల్లే తాతాజీ , పాస్టర్ యోహన,మరియు YSRCP కార్యకర్తల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భారత దేశం వెలుపల అత్యంత ఎక్కువ అభిమానులు పాల్గొన్న వేడుకగా దుబాయ్ లో నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే, దుబాయ్ లో నివసిస్తున్న YSRCP కార్యకర్తలు మరియు జగనన్న అభిమానులు బర్ దుబాయ్ ప్రాంతంలోని హోటల్ నిహాల్ లో జగనన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 600 మంది కార్యకర్తలు మరియు జగనన్న అభిమానులు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
జగనన్న జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు, విచ్చేసిన మహిళలకు కార్యక్రమంలో భాగంగా నాలుగు వందలకు పైగా చీరల పంపిణీ, మహమ్మద్ జిలాన్ భాష మరియు పవన్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 150 ప్రవాసఆంధ్రులకు APNRTS బీమా పథకంకు ఆర్థిక సహాయం చేశారు.
దాదాపు 100 మందికి పైగా కొత్తవారిని YSRCP పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత ప్రసన్న సోమిరెడ్డి మరియు మహమ్మద్ జిలాన్ భాష ,మోహన్ తరపట్ల ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాలనలో జరిగిన అభివృద్ధిని మరియు సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మళ్లీ వచ్చే 2024 ఎలక్షన్లలో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎటువంటి విభేదాలు లేకుండా, ఒకరినొకరు కలుపుకొని, ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తీ వంచన లేకుండా కృషి చేసి మళ్లీ వైఎస్ఆర్సిపి పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుని మన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని విచ్చేసి, విజయవంతం చేసిన కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.కార్యక్రమంలో నాసర్ సయ్యద్,బ్రహ్మానంద రెడ్డి, ఓగూరి శ్రీనివాస్ ,పాస్టర్ అనిల్,కొల్లే రవికుమార్, కటికితల ప్రకాష్, పాలపర్తి నీలిమ, గోసంగి లక్ష్మి, విజయ, మేడిది శ్యామ్, కళ్యాణ్,శ్యామ్ సురేంద్ర రెడ్డి,వెంకట రమణా రెడ్డి,సయ్యద్ సలీమ్,షేక్ షోయబ్,వెంకటప్ప రెడ్డి,RTA జహీర్,గూడూరు విజయ్ రెడ్డి,మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.




తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







