నైజీరియాలో మరో మారణహోమం..
- December 26, 2023
నైజీరియా: సాయుధ మూకల అరాచక దాడులతో వణికిపోతున్న నైజీరియాలో మరో దారుణం వెలుగుచూసింది. మధ్య నైజీరియాలోని పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా ‘బండిట్స్’గా పిలిచే సాయుధ సమూహాలు అరాచక దాడులకు తెగబడ్డాయి. కాల్పులతో నరమేధాన్ని సృష్టించాయి. వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయినట్టుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే సోమవారం కూడా ఈ కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాడుల్లో గాయపడిన దాదాపు 300 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు తెగపడ్డాయి. దాడి సమయంలో సెంట్రల్ నైజీరియాలోని ఇళ్లకు నిప్పు పెట్టారని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కనీసం 20 వేర్వేరు కమ్యూనిటీలపై దాడులు చేసి ఇళ్లకు నిప్పంటించినట్లు తెలుస్తోంది. అలాగే 300 మందికి పైగా గాయపడిన వారిని బోకోస్, జోస్, బార్కిన్ లాడిలోని ఆసుపత్రులకు తరలించారు. స్థానిక రెడ్క్రాస్ సమాచారం మేరకు బొక్కోస్ ప్రాంతంలోని 18 గ్రామాలలో 104 మరణాలు, బార్కిన్ లాడి ప్రాంతంలోని అనేక గ్రామాలలో కనీసం 50 మంది మరణించినట్లు తెలుస్తోంది. ముష్కరులు కనీసం 20 వేర్వేరు కమ్యూనిటీలపై దాడులు చేసి ఇళ్లకు నిప్పంటించినటలు తెలుస్తోంది. 300 మందికి పైగా గాయపడిన వారిని బోకోస్, జోస్, బార్కిన్ లాడిలోని ఆసుపత్రులకు తరలించారు. స్థానిక రెడ్క్రాస్ నుంచి తాత్కాలిక టోల్ బొక్కోస్ ప్రాంతంలోని 18 గ్రామాలలో 104 మరణాలను నివేదించింది. బార్కిన్ లాడి ప్రాంతంలోని అనేక గ్రామాలలో కనీసం 50 మంది మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. దాడులను ఖండిస్తున్నామని, భద్రతా బలగాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్లమెంటు సభ్యుడు డిక్సన్ చోలోమ్ కోరారు. బొక్కోస్ ప్రాంతంలో ప్రారంభమైన దాడులు పొరుగున ఉన్న బార్కిన్కు వ్యాపించాయని, అక్కడ 30 మంది చనిపోయారని స్థానిక ఛైర్మన్ దంజుమా డాకిల్ తెలిపారు. ఈ ఊత కోతను అనాగరికమైనదిగా, క్రూరమైనదిగా రాష్ట్ర గవర్నర్ కాలేబ్ ముట్ఫ్వాంగ్ అభివర్ణించారు. ప్రజలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని గవర్నర్ అధికార ప్రతినిధి గ్యాంగ్ బెరే తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!