ఏపీ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కీలక సమావేశాలు
- December 26, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో జనసేన నుంచి కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక సీట్లు కేటాయించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
జనసేన గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలపై పవన్ ఇప్పటికే సర్వే చేయించారు. ఆ స్థానాల్లో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలను కూడా రచించుకున్నారు. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపిక కోసం సమీక్షలు పూర్తి చేశారు. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాల్లో జనసేన అభ్యర్థులపై పవన్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు రెండవ విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో కాకినాడలో గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై సమీక్ష నిర్వహించనున్నారు. జనసేన పార్టీ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా జనసేన నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. ఇటీవల నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు, ఏపీ సీఎం అభ్యర్థి వంటి అంశాలపై కూడా తమ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







