ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కొలకలూరి మధుజ్యోతి నియామకం
- December 27, 2023
అమరావతి: కుప్పం, ద్రవిడ యూనివర్సిటీ ఉప కులపతిగా ఆచార్య డాక్టర్ కొలకలూరి మధుజ్యోతిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వ విద్యాలయాల కులపతి ఎస్. అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ మధుజ్యోతి తెలుగు విభాగంలో శాఖాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ కుమార్తె మధుజ్యోతి. తండ్రి కూతుర్లు ఉప కులపతులుగా సేవలందించే అదృష్టం కొలకలూరి కుటుంబానికి దక్కింది. ఇదొక చరిత్ర. ఇదొక రికార్డు గా చెప్పుకోవచ్చు.
అనంతపురంకు చెందిన ఆచార్య మధుజ్యోతి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఎంఎ గోల్డ్ మెడలిస్ట్. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్ డి చేశారు. అనువాదంలో, తమిళ్ లో పిజీ డిప్లొమాలు చేశారు. హిందీ భాషతో పాటు సంస్కృతంలోనూ ప్రావీణ్యత సంపాదించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 160 పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. బెజవాడ గోపాలరెడ్డి కవిత్వం - సౌందర్యం, తెలుగు సాహితీ వస్తు పరిణామం, సాహిత్య వీక్షణం, దండోరా - అంబేద్కర్ అభీష్టం, శ్రీ తాళ్లపాక సాహిత్యానుశీలం, ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యంపై విమర్శనం, దళిత సంస్కృతి, దళిత సాహిత్య సౌందర్య తత్వం, సంకల్పం సంఘర్షణ జయకేతనం, గుర్రం జాషువా ఇలా 20 పుస్తకాలు రచించి ప్రచురించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం









