50 శాటిలైట్లను ప్రయోగిస్తాం: ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్
- December 29, 2023
బెంగళూరు: భారతదేశ కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచం నలుమూలాలా వ్యాపింపజేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని లక్ష్యాలను పెట్టుకుంది. 2023లో దేశానికి ఇస్రో ఎన్నో విజయాలను సాధించి పెట్టింది.
చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1ను విజయవంతంగా ప్రయోగించడంతో పాటు మరిన్ని లక్ష్యాలకు 2023లో పునాదులు వేసుకుంది ఇస్రో. ఇవేగాక జియో ఇంటెలిజెన్స్ కు సంబంధించి శాటిలైట్లపై కూడా దృష్టి సారించింది. జియో ఇంటెలిజెన్స్ కోసం ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
పలు కక్ష్యల్లో శాటిలైట్ల లేయర్లను సృష్టించి వేలాది కిలోమీటర్ల దూరంలోని సైనికుల కదలికలను పసిగట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వంటి లక్ష్యాలతో వీటిని ప్రయోగిస్తున్నట్లు ఎస్.సోమనాథ్ వివరించారు. శక్తిమంతమైన దేశంగా భారత్ను తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రస్తుతం ఉన్న జియో ఇంటెలిజెన్స్ సరిపోదని గుర్తించినట్లు చెప్పారు.
ఇప్పుడు ఉన్నదానికంటే పది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే జియో ఇంటెలిజెన్స్ కావాలని ఎస్.సోమనాథ్ తెలిపారు. ఈ సామర్థ్యం మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తాజాగా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే నిర్వహించిన టెక్ఫెస్ట్లో పాల్గొన్న సోమనాథ్ ఈ విషయాలు తెలిపారు.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







