ఎంబసీ ఆధ్వర్యంలో ‘ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్’
- December 30, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం "ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్"ను ప్రకటించింది. జనవరి 12న సాయంత్రం 6.30 గంటల నుంచి సీఫ్లోని ఎంబసీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది.ఇది భారతీయ ప్రవాసులను ఏకతాటిపైకి తీసుకురావడం, భారతదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు వర్గాల విభిన్న వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫుడ్ వారసత్వం, హస్తకళలను వివరించే స్టాల్స్ మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు రాష్ట్రాల శాస్త్రీయ/జానపద ప్రదర్శనలను సూచించే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బహ్రెయిన్లోని భారతీయ రాయబార కార్యాలయం ఈ పండుగ సందర్భంగా పాల్గొనడానికి మరియు ఈ సాంస్కృతిక మహోత్సవంలో భాగమవ్వాలని భారతీయ ప్రవాసులందరికీ సాదరంగా ఆహ్వానించింది. ఎంట్రీ ఉచితమని, ముందుగా తమ పేర్లను (https://forms.gle/BCafvcLfhpSKa74P9)నమోదు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!







