న్యూ ఇయర్ సందర్బంగా గవర్నర్ తమిళిసై ఓపెన్ హౌస్
- December 31, 2023
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో సోమవారం గవర్నర్ తమిళిసై ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు రాజ్ భవన్ కు వచ్చి విషెస్ చెప్పొచ్చని అధికారిక ప్రకటన చేసారు. రాజ్ భవన్ కు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకు రావొద్దని చెప్పారు. పుస్తకాలతో పాటు ఇతర వస్తువులను తీసుకొస్తే స్టూడెంట్స్ కు అందజేస్తామని గవర్నర్ పేర్కొన్నారు.
ఇక గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీ గా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం అవుతున్న వార్తలపై గవర్నర్ తమిళిసై క్లారిటీ ఇచ్చారు. తూత్తుకుడిలో వరద బాధితులను పరామర్శించేందుకే వెళ్లాలని, ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలని ఢిల్లీకి వెళ్లి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా కొనసాగుతున్నానని, భవిష్యత్లోనూ గవర్నర్ గానే ఉంటానని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









