న్యూ ఇయర్ సందర్బంగా గవర్నర్ తమిళిసై ఓపెన్ హౌస్
- December 31, 2023
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో సోమవారం గవర్నర్ తమిళిసై ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు రాజ్ భవన్ కు వచ్చి విషెస్ చెప్పొచ్చని అధికారిక ప్రకటన చేసారు. రాజ్ భవన్ కు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకు రావొద్దని చెప్పారు. పుస్తకాలతో పాటు ఇతర వస్తువులను తీసుకొస్తే స్టూడెంట్స్ కు అందజేస్తామని గవర్నర్ పేర్కొన్నారు.
ఇక గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీ గా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం అవుతున్న వార్తలపై గవర్నర్ తమిళిసై క్లారిటీ ఇచ్చారు. తూత్తుకుడిలో వరద బాధితులను పరామర్శించేందుకే వెళ్లాలని, ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలని ఢిల్లీకి వెళ్లి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా కొనసాగుతున్నానని, భవిష్యత్లోనూ గవర్నర్ గానే ఉంటానని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







