రెండు రోజులపాటు దక్షిణాదిలో ప్రధాని మోడీ పర్యటన
- January 02, 2024
తిరుచిరాపల్లి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిన రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు తమిళనాడులో పర్యటిస్తున్నారు. తిరుచిరాపల్లిలో పర్యటించిన మోడీ భారతీదాసన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన వర్సిటీలు ప్రపంచస్థాయి ర్యాంకులు సాధిస్తున్నాయిని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచుకుని మంచి ర్యాంకుల్లో నిలుస్తున్నాయని మోడీ తెలిపారు. నేడు ప్రతి రంగం ఆవిష్కరణలు కోరుకుంటోంది అని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా రూ.19,850 కోట్లతో అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏవియేషన్, రైలు, రోడ్డు, షిప్పింగ్ రంగాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ‘యువత అంటేనే సమాజ రూపురేఖలు మార్చే శక్తి. వర్సిటీల నుంచి వచ్చే యువత సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. దేశంలోని విమానాశ్రయాలను పదేళ్లలో రెట్టింపు చేశాం. దేశంలోని 74 విమానాశ్రయాలను పదేళ్లలో 150కు పెంచాం. ప్రధాన పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం రెండింతలు చేశాం.’ అని మోడీ అన్నారు. మరోవైపు రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేపు లక్షద్వీప్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కవరత్తిలో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







