రెండు రోజులపాటు దక్షిణాదిలో ప్రధాని మోడీ పర్యటన
- January 02, 2024
తిరుచిరాపల్లి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిన రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు తమిళనాడులో పర్యటిస్తున్నారు. తిరుచిరాపల్లిలో పర్యటించిన మోడీ భారతీదాసన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన వర్సిటీలు ప్రపంచస్థాయి ర్యాంకులు సాధిస్తున్నాయిని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచుకుని మంచి ర్యాంకుల్లో నిలుస్తున్నాయని మోడీ తెలిపారు. నేడు ప్రతి రంగం ఆవిష్కరణలు కోరుకుంటోంది అని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా రూ.19,850 కోట్లతో అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏవియేషన్, రైలు, రోడ్డు, షిప్పింగ్ రంగాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ‘యువత అంటేనే సమాజ రూపురేఖలు మార్చే శక్తి. వర్సిటీల నుంచి వచ్చే యువత సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. దేశంలోని విమానాశ్రయాలను పదేళ్లలో రెట్టింపు చేశాం. దేశంలోని 74 విమానాశ్రయాలను పదేళ్లలో 150కు పెంచాం. ప్రధాన పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం రెండింతలు చేశాం.’ అని మోడీ అన్నారు. మరోవైపు రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేపు లక్షద్వీప్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కవరత్తిలో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







