నిర్మాతగా మారనున్న వెంకటేష్.!
- January 05, 2024
టాలీవుడ్ నిర్మాతల్లో అగ్ర నిర్మాత అయిన దివంగత రామానాయుడుకి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా చాలా అభిమానం. అంతులేని ఇష్టం. ముద్దుగా ‘రాజా’ అని పిలుచుకునేవారు చిరంజీవిని ఆయన.
కానీ, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా తెరకెక్కకపోవడం విశేషం. రామానాయుడు చివరి రోజుల్లో కూడా ఎలాగైనా చిరంజీవితో సినిమా తీయాలన్న తన మనసులోని కోరికని బయట పెట్టారు. కానీ, ఆ కోరిక తీరకుండానే చనిపోయారాయన.
అందుకే తండ్రి కోరికను తీర్చేందుకు తనయుడు వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందించాలని అనుకుంటున్నారట వెంకటేష్. ఆ సినిమాలో చిరుతో పాటూ వెంకటేష్ కూడా నటించబోతున్నారట.
ఈ సినిమాకి వెంకటేష్తో పాటూ, చిరంజీవి కూడా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోనున్నారనీ ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా ‘సైంధవ్’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరైన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమం సందర్భంగానే వెంకటేష్.. చిరంజీవితో కలిసి సినిమా చేయాలని వుందన్న తన కోరికను బయట పెట్టారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే, వెంకీ కోరికతో పాటూ, తండ్రి రామానాయుడి కోరిక కూడా ఈ విధంగా తీరిపోనుందన్న మాట. అయితే, ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగల దర్శకుడు ఎవరో ప్రస్తుతానికి సస్పెన్సే.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







