నిర్మాతగా మారనున్న వెంకటేష్.!
- January 05, 2024
టాలీవుడ్ నిర్మాతల్లో అగ్ర నిర్మాత అయిన దివంగత రామానాయుడుకి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా చాలా అభిమానం. అంతులేని ఇష్టం. ముద్దుగా ‘రాజా’ అని పిలుచుకునేవారు చిరంజీవిని ఆయన.
కానీ, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా తెరకెక్కకపోవడం విశేషం. రామానాయుడు చివరి రోజుల్లో కూడా ఎలాగైనా చిరంజీవితో సినిమా తీయాలన్న తన మనసులోని కోరికని బయట పెట్టారు. కానీ, ఆ కోరిక తీరకుండానే చనిపోయారాయన.
అందుకే తండ్రి కోరికను తీర్చేందుకు తనయుడు వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందించాలని అనుకుంటున్నారట వెంకటేష్. ఆ సినిమాలో చిరుతో పాటూ వెంకటేష్ కూడా నటించబోతున్నారట.
ఈ సినిమాకి వెంకటేష్తో పాటూ, చిరంజీవి కూడా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోనున్నారనీ ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా ‘సైంధవ్’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరైన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమం సందర్భంగానే వెంకటేష్.. చిరంజీవితో కలిసి సినిమా చేయాలని వుందన్న తన కోరికను బయట పెట్టారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే, వెంకీ కోరికతో పాటూ, తండ్రి రామానాయుడి కోరిక కూడా ఈ విధంగా తీరిపోనుందన్న మాట. అయితే, ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగల దర్శకుడు ఎవరో ప్రస్తుతానికి సస్పెన్సే.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









