రేస్లోంచి తప్పుకున్న మాస్ రాజా.!
- January 05, 2024
సంక్రాంతి రేస్లో ఈ సారి ఐదు సినిమాలు పోటీలో వున్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోలు మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వున్నారు. వారితో పాటూ, మాస్ రాజా రవితేజ కూడా ‘ఈగల్’ సినిమాతో సిద్ధమయ్యారు. అయితే, నిర్మాతల మండలి చర్చోపచర్చల తర్వాత మాస్ రాజా వెనక్కి తగ్గిపోయారు.
‘ఈగల్’ నిర్మాత తన సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 9న సోలోగా ‘ఈగల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెద్ద హీరోల సినిమాలున్నప్పుడు ఖచ్చితంగా ధియేటర్ల సమస్య తలెత్తుతుంది. ఆ యాంగిల్లోనే ముగ్గురు పెద్ద హీరోలకూ ధియేటర్ల పంపకం జరిగింది. దాంతో, రవితేజ సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు.
ఈ మధ్య అసలే మాస్ రాజా సినిమాలకు సరైన ఓపెనింగ్సే రావడం లేదు. అలాంటిది, ఇంత పోటీ మధ్య రావడం సబబు కాదనుకున్నారో ఏమో.! తమంతట తాముగా రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది.
‘మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్కు కాదు.. ఇండస్ర్టీ బాగు కోసం.. ఓ మంచి సినిమాని జనాలకి ఎక్కువ ధియేటర్లలో అందుబాటులో వుంచడం కోసమే ఈ మార్పు..’ అని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా సినిమా వాయిదాని ‘ఈగల్’ నిర్మాత ప్రకటించారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







