2023లో ఫుడ్ అవుట్లెట్లపై 210,000కి పైగా తనిఖీలు
- January 06, 2024
దోహా : ప్రజల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆహార విక్రయ కేంద్రాలను కఠినంగా పర్యవేక్షిస్తోంది. మొత్తం ఎనిమిది మునిసిపాలిటీలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2023లో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఫుడ్ అవుట్లెట్లపై భారీ సంఖ్యలో 210,733 తనిఖీలు నమోదయ్యాయి. తనిఖీల సందర్భంగా 2023లో 240 ఆహార విక్రయ కేంద్రాలు మూతపడ్డాయి. సాధారణంగా, ఉల్లంఘన తీవ్రతను బట్టి ఆహార దుకాణాలు వారాలపాటు తాత్కాలికంగా మూసివేయబడతాయి. మున్సిపల్ ఇన్స్పెక్టర్లు కూడా ఔట్లెట్లలో 30,200 ఆరోగ్య నిబంధనల ఉల్లంఘనలను నమోదు చేశారు. 4,910 ఆహార నమూనాలను ఫుడ్ అవుట్లెట్ల నుండి సెంట్రల్ లాబొరేటరీకి తరలించారు. అవి మానవ వినియోగానికి సరిపోతాయో లేదో తనిఖీ చేసింది. హెల్త్ మానిటరింగ్ యూనిట్కు ఫుడ్ అవుట్లెట్లపై 2,131 ఫిర్యాదులు అందగా.. వాటిపై వెంటనే స్పందించారు. 2023లో 314,295 వధించిన జంతువులను పశువైద్య వైద్యులతో కూడిన మునిసిపల్ తనిఖీ బృందాలు కబేళాలలో తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 4,182 కళేబరాలు, 86,924 కిలోల మాంసాన్ని మానవ వినియోగానికి పనికిరానివిగా గుర్తించి డెస్ట్రాయ్ చేశారు. చేపల మార్కెట్లలో తనిఖీల సందర్భంగా.. గత సంవత్సరం 38,902 టన్నుల చేపలను పరిశీలించి మానవ వినియోగానికి పనికిరాని 157 కిలోల చేపలను నాశనం చేశారు. అత్యధికంగా 72,148 తనిఖీలు, అల్ రేయాన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్లెట్లపై జరిగాయి. ఇక్కడ 39 అవుట్లెట్లు మూసివేశారు. 24,699 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఆ తర్వాత దోహా మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఫుడ్ అవుట్లెట్లలో 68,174 తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







