శ్రీవారి భక్తులకు అలెర్ట్..
- January 08, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు http://thirupathibalaji.ap.gov.in పేరు ఉండగా..
దాన్ని http://ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్సైట్, వన్ మొబైల్ యాప్లో భాగంగా వెబ్సైట్ను మార్చినట్లు వివరించింది. వెబ్సైట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల వెబ్సైట్ ద్వారానే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై నుంచి భక్తులు కొత్త వెబ్సైట్లోనే టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు
- స్టార్లింక్కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







