మైక్రోసాఫ్ట్ అధినేత నేడు ప్రధానమంత్రి మోదీతో భేటీ ..
- May 30, 2016
భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ రంగం, పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో కూడా నాదెళ్ల సమావేశమయ్యారు.
మైక్రోసాఫ్ట్ నిర్వహించిన 'టెక్ ఫర్ గుడ్, ఐడియాస్ ఫర్ భారత్' కార్యక్రమం కోసం సత్య నాదెళ్ల నేడు దిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ వినియోగం ఆవశ్యకతను గురించి వివరించారు. 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెళ్ల భారత్కు రావడం ఇది మూడోసారి. భారత్లో మైక్రోసాఫ్ట్ 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది నవంబర్లో ఆయన తొలిసారిగా భారత్కు వచ్చారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో ముంబయికి వచ్చిన ఆయన హైదరాబాద్లోని ఐటీ హబ్ను కూడా సందర్శించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







