అటల్ సేతు బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 12, 2024
ముంబై: ముంబైలో సముద్రంపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బ్రిడ్జ్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ను అటల్ సేతు(Atal Setu)గా పిలువనున్నారు.
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా దీన్ని పిలుస్తున్నారు. ఈ బ్రిడ్జ్ సుమారు 21.8 కిలోమీటర్ల పొడుగు ఉంది. బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్పేయి సేవారి-నహవా సేవా అటల్ సేతు. సుమారు 17,840 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. దాదాపు రెండున్నర గంటల జర్నీని కేవలం 20 నిమిషాలకు కుదిస్తోంది.
భారత్లోనే అతిపొడువైన బ్రిడ్జ్గా దీన్ని గుర్తిస్తున్నారు. ఇక దేశంలో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జ్ కూడా ఇదే కానున్నది. డిసెంబర్ 2016లో ప్రధాని మోదీనే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుశస్థాపన చేశారు. ముంబై పోర్టు నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్టు మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







